సమస్యాపూరణ:
" దగ్గు వారలకే శాంతి దక్కుచుండు "
తే.గీ. రాజధర్మములెల్లను ప్రౌఢి కలిగి
పల్కువడి బుద్ధిహీనుడై వాదులాడు
సామితో తగవాడక సహనమెంచి
దగ్గు వారలకే శాంతి దక్కుచుండు.
" దగ్గెడి వారికే సుఖము దక్కునుగాదె ధరాతలమ్మునన్ "
ఉ. చక్కని రాజధర్మములు శస్తమునౌవిధి తెల్పువేళలో
పెక్కుగ మూర్ఖవాదనలు వెంబరియై యొనరించు రాజుతో
చిక్కులు సంభవించునను చింతనజేసి క్షమన్ ఘటించుచున్
దగ్గెడి వారికే సుఖము దక్కునుగాదె ధరాతలమ్మునన్.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి