28, మార్చి 2023, మంగళవారం

 చరణ శరణాగతి తత్వం  - ఒక కథ

అది అడవి.  మేకలు, గొర్రెలు మేతకు వెళ్ళాయి. ఒక మేక మేత మేస్తూ ఒక తీగలో చిక్కుకుంది.  దాని లోంచి బయట పడలేకపోయింది.  చీకటి పడింది.  అన్ని మేకలూ తలోదిక్కూ వెళ్ళిపోయాయి.  ఈ మేక చిన్నగా తీగలోంచి బయటపడింది. చిన్నగా అటూ ఇటూ తిరిగి ఒక సరస్సు ఒడ్డుకు చేరింది.  చాలా భయపడుతోంది.  అనాథ అయింది.  దానికి అక్కడ తడి మట్టిపై, సింహపు కాలిముద్ర కన్పించింది.  దాన్ని పట్టుకుని కూర్చుంది.  దాన్నే శరణువేడుకుంటోంది. (చరణ శరణాగతి)


ఇంతలో నక్కలు, తోడేళ్ళూ తినడానికి ముందుకు vachchaayi.  వాటితో మేక " నేను ఎవరిని శరణు పోందానో చూడండి... తరువాత నన్ను తినండి " అన్నది.  అవి సింహం కాలిగుర్తు బాగా చూసాయి.  ' దీని వెనుక రక్షగా సింహం ఉంది.  అమ్మబాబోయ్' అని పారిపోయాయి. 


చివరిగా ఈ కాలిగుర్తుగల సింహమే వచ్చి, తినబోయింది.  ఒంటరిగా ఏం చేస్తున్నావని మేకను అడిగింది.  " నా ప్రభువును ధ్యానిస్తున్నా, ఈ ముద్ర చూడు.  వీరు నా ప్రభువు.  వీరి శరణు జొచ్చాను, చూడు  " అంది.  సింహం ఆ గుర్తును చూసి, ఆ కాలి గుర్తు తనదేనని, తనను శరణుజొచ్చిందని తలచి, " నీవిక నిర్భయంగా ఉండు " అని అభయమిచ్చింది. 


ఆ ప్రాంతానికి ఏనుగు వస్తే, సింహం పిలిచింది... " రోజూ ఈ మేకను వీపుపై ఎక్కించుకుని అడవికి తీసికెళ్ళు.  మేపుకొని రా " అని ఆదేశించింది.  ఏనుగు అలాగే చేసింది.  " చరణ శరణాగతి పొందిన మేక జీవితం ఆనందంగా గడిచింది.  ఇది చరణ శరణాగతితత్వం అంటే.  కనుక ఏకాగ్ర చిత్తంతో భగవంతుని పాదపద్మాలపై మనస్సు లగ్నం చేస్తే, మోక్షం లభిస్తుంది.  ఇదే చరణ శరణాగతి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

:: రామనవమి ::        లోకకంటకుడై, లంకాద్వీపాన్ని పాలించే రావణుడు ఒకనాడు తన పట్టమహిషి అయిన మండోదరితో బయలుదేరి పులస్త్యుణ్ణి చూడటానికి వెళ్ళాడు...