4, మార్చి 2026, బుధవారం

 

:: సులభ భక్తి - అరటి తొక్కల విందు ::

     కురుక్షేత్ర యుద్ధానికి ముందు రాయబారిగా వచ్చిన కృష్ణుడు, దుర్యోధనుడు ఏర్పాటు చేసిన రాజభోగాలను తిరస్కరిస్తాడు. "భక్తి లేని చోట పాలు కూడా విషమే" అని చెప్పి, పరమ భక్తుడైన విదురుని ఇంటికి బయలుదేరుతాడు. విదురుడు ఇంట్లో లేడు, ఆయన భార్య సులభ (విదుర భార్య) ఒక్కతే ఉంది. సాక్షాత్తు ఆ జగన్నాథుడే తన ఇంటికి నడిచి వచ్చేసరికి ఆమె కళ్ళు నమ్మలేకపోయింది. ఆనందంతో ఆమె ఒళ్లు పరవశించిపోయింది.

     తమ ఇంట్లో ఉన్నవి కొన్ని అరటిపండ్లు మాత్రమే. ఆకలితో ఉన్న కృష్ణుడికి పండ్లు ఇవ్వాలనుకుంది. పండు వలుస్తోంది.. కానీ ఆమె చూపులు, మనసు అంతా కృష్ణుడి చిరునవ్వు మీద, ఆయన నీలమేఘ శ్యామల రూపం మీదే ఉన్నాయి. ఆ తన్మయత్వంలో ఆమె ఏం చేస్తోందో ఆమెకే తెలియలేదు. అరటిపండు వలిచి, రుచికరమైన పండును పక్కన పడేసి, ఎందుకూ పనికిరాని తొక్కను కృష్ణుడికి అందించింది. లోక రక్షకుడు కృష్ణుడు ఆమె అమాయకత్వాన్ని, అపారమైన భక్తిని చూసి మురిసిపోయాడు. లోకమంతా పంచభక్ష్య పరమాన్నాలు పెట్టినా దొరకని తృప్తి ఆ అరటి తొక్కలో ఉందని భావించి, ఎంతో ఇష్టంగా దాన్ని తిన్నాడు.

     అంతలో విదురుడు వచ్చి ఆ దృశ్యాన్ని చూసి హడలిపోయాడు. "పిచ్చిదానా! ఏం చేస్తున్నావు? స్వామికి తొక్కలు పెడతారా?" అని భార్యను గద్దించాడు. కృష్ణుడు విదురుడిని ఆపి ఇలా అన్నాడు.. "విదురా! ఈ తొక్కల్లో ఉన్న రుచి నీ పండ్లలో లేదు. ఎందుకంటే ఇందులో లోకమంతా వెతికినా దొరకని 'ప్రేమ' ఉంది. ఆమె నాకు ఇచ్చింది తొక్కను కాదు, ఆమె హృదయాన్ని!"

     భగవంతుడు మన దగ్గర ఆశిచ్చేది బంగారాన్ని కాదు, మన కంటి పాపలో ఉండే భక్తిని. ఈ రెండు కథలు మనకు నేర్పేది ఒక్కటే.. అహంకారం లేని ఆత్మార్పణే దైవానికి అత్యంత ప్రీతిపాత్రం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

  :: ఉపమన్యువు కథ - ఆకలి తీర్చిన పరమశివుడు ::      జీవితంలో ఒక్కోసారి మనకు చాలా చిన్న కోరికలు ఉంటాయి. కానీ అవి తీరనప్పుడు కలిగే బాధ వర్ణనాతీ...