:: ఓర్పు ముందు కోపం ఓడిపోయింది ::
ఒక మహర్షి శాపం కంటే, ఒక సామాన్య భక్తుడి ప్రార్థన శక్తివంతమైనదా? సుదర్శన చక్రం ఒక మునిని లోకాలన్నీ ఎందుకు పరుగులు పెట్టించిందో తెలుసా?
అంబరీష మహారాజు గొప్ప విష్ణు భక్తుడు. ఆయన రాజ్యపాలన చేస్తూనే ఏకాదశీ వ్రతాన్ని అత్యంత నిష్ఠతో ఆచరించేవాడు.
ఒకసారి ద్వాదశి ఘడియలు ముగిసే లోపు అంబరీషుడు భోజనం చేయాలి. సరిగ్గా అదే సమయానికి కోపిష్ఠిగా పేరుగాంచిన దుర్వాస మహర్షి అక్కడకు వస్తాడు. నదికి వెళ్ళి స్నానం చేసి వస్తానని చెప్పిన ముని, సమయానికి తిరిగిరారు. వ్రత నియమం ప్రకారం సమయం మించి పోకూడదని, అంబరీషుడు కేవలం తులసి తీర్థం పుచ్చుకుంటాడు.
అదిచూసి ఆగ్రహించిన దుర్వాసుడు, తన జడనుండి ఒక భూతాన్ని సృష్టించి అంబరీషుడిని చంపమంటాడు. అప్పుడు భక్తసులభుడైన విష్ణువు పంపిన సుదర్శనచక్రం వచ్చి ఆ భూతాన్ని అంతం చేసి, దుర్వాసుడిని వెంటాడుతుంది. లోకాలన్నీ తిరిగినా ఎవరూ ఆయనను రక్షించలేరు. చివరకు అంబరీషుడి పాదాలమీద పడితేనే ఆయన ప్రాణాలు దక్కుతాయి.
బలం అధికారంలోనో, శాపాల్లోనో లేదు. భగవంతుడి పట్ల ఉండే అంకితభావంలో ఉంది. అంబరీషుడు ఓర్పు ముందు దుర్వాసుడి కోపం ఓడిపోయింది. అందుకే అంటారు, భక్తి ముందు అహంకారం ఎప్పుడూ ఓడిపోతుందని!
ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలకోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
అన్నట్టు..... రేపు గురువారం. మన ఛానల్ లో శివలీలామృతం ప్రత్యేక వీడియో రాబోతోంది. ముక్కంటి ఆగ్రహానికి మన్మథుడు ఎలా భస్మమయ్యాడో ... ఆ " మన్మథ దహనం " అద్భుత ఘట్టాన్ని రేపటి పెద్ద వీడియోలో తప్పక వినండి.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి