:: పిడికెడు గింజలకే పెన్నిధినిచ్చిన పరమాత్ముడు ::
నమస్కారం. భాగవత సుధకు స్వాగతం.
ఈరోజు మనం ఒక మధురమైన ఘట్టం గురించి తెలుసుకుందాం. బాలకృష్ణుడు బృందావనంలో ఉన్నప్పుడు, ఒక పండ్లమ్మే ఆవిడ " పండ్లు కావాలా పండ్లు " అని పిలుస్తూ వెడుతోంది. ఆ పిలుపు విన్న చిన్నికృష్ణుడు, తనకు పండ్లు కావాలని ఆశపడ్డాడు. కానీ, ఆ పసివాడికి లోకజ్ఞానం తెలియదుకదా! ఇంట్లో ఉన్న ధాన్యాన్ని తన చిన్ని దోసిట్లోకి తీసుకొని, ఆ పండ్లమ్మ దగ్గరకు పరుగు తీసాడు. ఆ గింజలు తన చిన్ని చేతులనుండి కింద జారిపోతున్నా లెక్క చేయకుండా తడబడే అడుగులతో ఆవిడ ముందుకు వెళ్ళి నిలబడ్డాడు. ఆ పండ్లమ్మ ఆ బాలుడి ముగ్ధ రూపానికి, ఆ అమాయకత్వానికి మురిసిపోయింది. ఆ పిడికెడు గింజలకోసం చూడకుండా, తన బుట్టలో ఉన్న పండ్లన్నీ ఆ కృష్ణయ్యకు ఇచ్చేసింది. ఆశ్చర్యం ఏమిటంటే, ఆ లోకరక్షకుడు పండ్లు తీసుకొని వెళ్ళిన వెంటనే ఆ పండ్లమ్మ ఖాళీ బుట్ట రత్నాలతో నిండి పోయింది. భగవంతుడు మన దగ్గర నుండి ఆశించేది మనం ఇచ్చే వస్తువు విలువను కాదు. ఆ వెనుక ఉన్న స్వచ్ఛమైన భక్తిని మాత్రమే! ఈ కథాంశాన్ని శ్రీమద్భాగవతం దశమస్కంధం నుండి గ్రహించాను.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి