15, జనవరి 2026, గురువారం

:: మహాభారత రహస్యాలు - 6

భీష్ముని 'భీషణ' ప్రతిజ్ఞ హస్తినాపుర చరిత్రను, కురువంశ భవిష్యత్తును పూర్తిగా మార్చివేసింది. దీని వల్ల జరిగిన ప్రధాన మార్పులు నాలుగు. మొదటిది వారసత్వ సంక్షోభం. భీష్ముడు రాజ్యత్యాగం చేసి, పెళ్ళి చేసుకోనని శపథం చేయడంతో, సమర్థుడైన పాలకుడు ఉన్నప్పటికీ సింహాసనం బలహీనపడింది. తదుపరి వారసులైన చిత్రాంగద, విచిత్రవీర్యులు అల్పాయుష్కులు కావడం వలన రాజ్యం అస్థిరతకు లోనయింది. రెండవది ధర్మ సంకటం పైపెచ్చు అశక్తత. భీష్ముడు కేవలం హస్తినాపుర సింహాసనానికి కట్టుబడతానని ప్రతిజ్ఞ చేశాడు. దీనివల్ల ద్రౌపదీ వస్త్రాపహరణం వంటి అధర్మాలు జరుగుతున్నా, తను చక్రవర్తి కానందున కేవలం చూస్తూ ఉండిపోవలసి వచ్చింది. ఆయన మౌనం కురువంశ నాశనానికి ఒక కారణమయింది. మూడవది కురుక్షేత్ర యుద్ధానికి పునాది పడటం. భీష్ముడు సింహాసనం అదిష్టించి ఉంటే, ధృతరాష్ట్రుడు లేదా పాండురాజు మధ్య వారసత్వ పోరు వచ్చేది కాదు. ఆయన తప్పుకోవడం వల్లే కౌరవ పాండవుల మధ్య విభేదాలు తలెత్తి, చివరకు అది ప్రపంచాన్నే మార్చిన కురుక్షేత్ర మహా సంగ్రామానికి దారి తీసింది. ఇంకొక ముఖ్యమైనది నాలుగవది వంశవృక్షం మార్పు అనేది. భీష్ముడి ప్రతిజ్ఞ కారణంగానే కురువంశాన్ని నిలబెట్టడానికి ' నియోగ పద్ధతి ' ద్వారా వ్యాస మహర్షిని పిలవాల్సి వచ్చింది. దీనివల్ల కురువంశ రక్తసంబంధం తీరు మారిపోయింది. 

భీష్ముడి ప్రతిజ్ఞ ఆయన పితృభక్తికి నిదర్శనం అయినప్పటికీ, అది హస్తినాపురానికి రక్షణ కవచంలా కాకుండా, ఆ వంశం అంతరించి పోవడానికి ఒక పరోక్ష కారణంగా మిగిలిపోయింది. అందుకే అంటారు - కొన్ని త్యాగాలు చరిత్రను కాపాడితే, మరికొన్ని చరిత్రను మార్చి వేస్తాయని. 

సరే! భీష్ముడి త్యాగం హస్తినాపురాన్ని అనాథను చేస్తే , అదే భీష్ముడు చేసిన ఒక చిన్నపొరపాటు , ఒక స్త్రీ ఆగ్రహానికి కారణమయింది. ఆ ఆగ్రహమే భీష్ముడి మరణానికి ఎలా దారితీసింది? భీష్ముడిని అంతం చెయ్యడానికి పుట్టిన ఆ శక్తి ఎవరు? వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన మహాభారత రహస్యాలకోసం లైక్ చేయండి మరియు సబ్ స్క్రైబ్ చేసుకోండి. 
  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

  :: ఉపమన్యువు కథ - ఆకలి తీర్చిన పరమశివుడు ::      జీవితంలో ఒక్కోసారి మనకు చాలా చిన్న కోరికలు ఉంటాయి. కానీ అవి తీరనప్పుడు కలిగే బాధ వర్ణనాతీ...